రాజకీయాల పరమార్ధం ప్రజాసేవే.. జనసేనుడి ఈ పలుకులు లక్షలాది మందికి స్ఫూర్తి వాఖ్యాలయ్యాయి.. ఎంతో మందిలో సేవాగుణాన్ని రగిల్చాయి.. ఏ సందర్భాన్నయినా జనసేవకు వినియోగించేలా పురిగొల్పాయి.. అందర్నీ జనాన్ని ఆపదనుంచి కాపాడేలా కార్యోన్ముకుల్ని గావించాయి.. జనం మధ్యన ఉండి జనాన్ని రక్షించే జనసైన్యంగా మార్చాయి.. జనసేనుడి సైన్యంలో దేశపు ఎల్లలు దాటివెళ్లిన ఎన్ఆర్ఐలు సైతం ఎంతో మంది ఉన్నారు.. ఇందులో ఎవ్వరికీ రాజకీయాలు., పదవులు పరమావధి కాదు., జనసేవతో కూడిన రాజకీయాలు లక్ష్యం..
ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇఫ్తర్ విందుల జోరు నడుస్తోంది.. పెద్ద పెద్ద పార్టీలు., పెద్ద పెద్ద మతగురువులతో ప్రార్ధనలు చేయిస్తూ., పెద్ద పెద్ద పార్టీలు ఇస్తుంటే., సామాన్యుడి పక్షమైన జనసైన్యం., పేద ముస్లిం సోదరుల అవసరాలు తీర్చే బాధ్యతను భుజాన వేసుకుంది.. ఖురాన్ మార్గాన్ని అనుసరించి సేవా-దానగుణాలను ఆచరణలో పెట్టారు జనసేన సైన్యం..
ఇందులో భాగంగా పాలకొల్లులో ఎన్ఆర్ఐ పొలిశెట్టి చంద్రశేఖర్ సహకారంతో పేద ముస్లిం సోదరుల కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరుల నుంచి అద్భుతమైన స్పందనతో పాటు ఆశీస్సులు కూడా లభించాయి.. చుట్టు పక్కల గ్రామాల్లోని ముస్లిం సోదరులు సైతం హాజరై., దుప్పట్లు అందుకుని జనసేనుడికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించారు.. ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలతో పాటు స్థానిక జనసేన కార్యకర్తలు పొలిశెట్టి నవీన్, రామలింగేశ్వరరావు, బల్లెం ప్రశాంత్, సూరి తదితరులు హాజరై., ముందు ముందు సేవా కార్యక్రమాలు మరింత విసృత పరుస్తామని హామీ ఇచ్చారు.. సమస్యల పరిష్కారం విషయంలోనూ జనసేనుడి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు..
అన్నిదానాల్లో అన్నదానం గొప్పదన్న సూక్తిని ఒంటబట్టించుకున్న జనసైనికులు., ఉదయం నుంచి కటిక ఉపవాసం ఆచరించే ముస్లిం సోదరులకి పవిత్ర మాసంలో కడుపు నింపేందుకు పోటీ పడ్డారు.. అందునా పేద ముస్లింలకు ఇఫ్తర్ వేళల్లో ఓపిక మేరకు అల్పాహార విందులు., మృష్టాన్న భోజనాలు ఏర్పాటు చేశారు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నియోజకవర్గంలో జనసైనికులు శక్తి మేర ఇఫ్తర్ విందులు ఏర్పాటు చేశారు.. ఉదయం లేచింది మొదలు సేవకు వేళాయే అంటూ సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్న జనసైన్యం తీరు., జనసేనాని వారిని నడిపిస్తున్న తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
originally published on PawanToday.com